By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 3:23 PM IST
వాహన తనిఖీల్లో పట్టుబడిన గంజాయి - 8 మంది అరెస్టు
Police Seized 10 kg Ganja in Vizianagaram District:విజయనగరం జిల్లాలో రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో 10 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి క్రయ, విక్రయాలు చేస్తున్న 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పట్టుబడిన వారిలో ఒక మైనర్ ఉండగా మిగిలిన ఏడుగురిని కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. గత పది రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. గంజాయి మత్తుకు బానిసై యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. జిల్లాలో గంజాయి క్రమ, విక్రయాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ వివరించారు.