By ETV Bharat Andhra Pradesh Team
Published : 7 hours ago
భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య చేసిన భర్త
Husband Murder his Wife :పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదని కట్టుకున్న భార్యనే భర్త కడతేర్చిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడులో జరిగింది. గలగల గ్రామానికి చెందిన బోయ వన్నూరుస్వామికి 8 ఏళ్ల కిందట జ్యోతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 3 రోజుల కిందట భర్తతో గొడవపడిన జ్యోతి పుట్టింటికి వెళ్లింది. దీంతో అర్ధరాత్రి మద్యం సేవించి జ్యోతి ఇంటికి వెళ్లి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.