Published : 5 hours ago
సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Gitam University Student Suicide in Sangareddy :సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలోని గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ బాలికల వసతి గృహంలో బీటెక్ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే వర్ష అనే యువతి బీటెక్ సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాగా ఆ విద్యార్థిని గత కొంతకాలంగా ఒంటరిగా ఉండేదని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులకు విశ్వవిద్యాలయ యాజమాన్యం సమాచారం అందించింది.