national

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

ETV Bharat / snippets

సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య

Gitam University Student Suicide in Sangareddy
Gitam University Student Suicide in Sangareddy (ETV Bharat)

Gitam University Student Suicide in Sangareddy :సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలోని గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ బాలికల వసతి గృహంలో బీటెక్​ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే వర్ష అనే యువతి బీటెక్​ సీఎస్​ఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాగా ఆ విద్యార్థిని గత కొంతకాలంగా ఒంటరిగా ఉండేదని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులకు విశ్వవిద్యాలయ యాజమాన్యం సమాచారం అందించింది.

ABOUT THE AUTHOR

...view details