Published : Aug 14, 2024, 12:46 PM IST
విదేశాల నుంచి రిటర్న్ - ఎయిర్పోర్టులో సీఎం రేవంత్కు గ్రాండ్ వెల్ కమ్
CM Revanth Returns To Hyderabad :పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. డప్పు చప్పుళ్లు, మేళ తాళాలతో కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారులు గ్రాండ్ గా వెల్ కమ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విదేశాలకు తాము ఏ లక్ష్యంతో వెళ్లలేదని అన్నారు. రాష్ట్ర ప్రగతిపై తమ ఆలోచన తెలిపేందుకే వెళ్లామని, తమ ఆలోచనలను పలు కంపెనీలు స్వాగతించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు. అమెజాన్ వెబ్ సర్వీస్ విస్తరణ హైదరాబాద్లో జరగనుందని వెల్లడించారు.