Published : Jun 4, 2024, 5:14 PM IST
మహబూబ్నగర్లో ఉత్కంఠ పోరు - రౌండ్ రౌండ్కు మారిన ఆధిక్యం - అంతిమంగా డీకే అరుణదే విజయం
BJP Candidate DK Aruna Won in Mahabubnagar :మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠత మధ్య జరిగింది. రౌండ్రౌండ్కు మారిన ఆధిక్యాల నడుమ ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. ఈ పార్లమెంట్ స్థానంపై ఆది నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడిన విజయం ఎట్టేకేలకు కమలం ఖాతాకు వెళ్లింది. సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి వంశీచంద్రెడ్డిపై డీకే అరుణ స్వల్ప ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేశారు. 21వ రౌండ్ ముగిసే సమయానికి, కేవలం 3,636 ఓట్లతో చల్ల వంశీచంద్ రెడ్డిపై గెలుపొందారు. మొత్తంగా డీకే అరుణకు 5,06,747 ఓట్లు రాగా, చల్ల వంశీచంద్ రెడ్డికి (కాంగ్రెస్) 5,03,111 ఓట్లు వచ్చాయి.