Published : Jun 26, 2024, 12:01 PM IST
|Updated : Jun 26, 2024, 12:07 PM IST
'త్వరలోనే పట్టుకుంటాం' - చిరుతను బంధించేందుకు అటవీ అధికారుల ట్రాప్
Arrangements To Capture The Leopard :రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 బోన్లు, 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాన్సిమియాగూడాలో పెట్టిన ట్రాప్ కెమెరాకు అడవి పిల్లి చిక్కింది. గ్రామంలో ఇప్పటికే ఓ దూడ, కుక్కపై దాడి జరిగింది. అది చిరుత లేదా హైనా అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవి పిల్లి జంతువులపై దాడి చేయదని అన్నారు. చిరుత లేదా హైనా ఏదైనా త్వరలోనే పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లి వస్తున్నారు.