Published : Jun 4, 2024, 11:01 AM IST
నవీన్ పట్నాయక్కు మోదీ గట్టి షాక్! ఒడిశాలో బీజేపీ దూకుడు
Odisha Assembly Election Results: ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ పయనిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిలో అత్యధిక స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యధిక అసెంబ్లీ సీట్లలో కమలం ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బిజూ జనతా దళ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ దఫా ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైంది. సంబల్ పుర్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆధిక్యంలో ఉండగా, పూరీ నుంచి సంబిత్ పాత్రా ముందంజలో ఉన్నారు. బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ కంటాబాంజీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.