ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు సభకు ఎందుకు వెళ్లావు ? - టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయుడి దాడి - YCP Activist Attack on TDP Activist - YCP ACTIVIST ATTACK ON TDP ACTIVIST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 9:32 AM IST

YCP Activist Attack on TDP Activist in Sivarampuram : రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు, దాడులకు హద్దే లేకుండా పోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైసీపీ వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు శివరామపురానికి చెందిన హరీష్ కుమార్ ఈ నెల 25న కుప్పంలో జరిగిన చంద్రబాబు సభలో పాల్గొన్నాడు. చంద్రబాబు సభకు ఎందుకు వెళ్లావంటూ శివరామపురం బస్టాండులో హరీష్ కుమార్​పై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గణేష్ దాడికి పాల్పడ్డాడు. 

హరీష్ కుమార్ తల్లి ప్రమీళమ్మ అడ్డుకోబోతే దుర్భాషలాడుతూ ఆమెపై కూడా దాడి చేశాడు. టీడీపీ సభకు వెళ్లానని తనపై విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న వారందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని హరీష్ వెల్లడించాడు. బాధితులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details