Telangana Inter Supplementary Exam Date 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసిన ఇంటర్ పరీక్షల ఫలితాలు రానే వచ్చాయి. ఈ పరీక్షలను ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9.81 లక్షల మంది విద్యార్థులు రాయగా, అందులో 6.09 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణతను సాధించారు. మిగిలిన 3.72 లక్షల మంది విద్యార్థులు పెయిల్ అయ్యారు.
ఇప్పుడు పాస్ కాని విద్యార్థులు, మార్కులు పెంచుకొనే వారి కోసం విద్యాశాఖ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్కి ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రతి పేపర్కు రూ.600 రుసుము చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. ఈ ప్రక్రియ ఆన్లైన్లో సాగుతుంది. ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయినా, మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎలాంటి సందేశాలు నివృతికి ఈ నెంబరుకు కాల్ చేయండి : విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి సందేశాలు ఉన్నా helpdeskie@telangana.gov.in కి మెయిల్ చేస్తే మీ సందేహాలు నివృత్తి అవుతాయి. లేకపోతే 04024655027కి కాల్ చేస్తే సరిపోతుంది. కొంత మంది విద్యార్థులు పాసు కాలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని, అలాంటి వారు ఈ ఫలితాలను సీరియస్గా తీసుకోకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలని విద్యాశాఖ సూచించింది. ఇలాంటి విద్యార్థుల కోసం టెలీమానస్ అనే సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ విద్యార్థులకు కావాల్సిన మానసిక ఉత్సాహాన్ని సైకాలజిస్ట్లు అందిస్తారు.