ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టేషన్​లో మౌనంగా కూర్చున్న పోసాని - 7 గంటలుగా విచారిస్తున్న పోలీసులు - POLICE SHIFTED POSANI TO PS

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని కృష్ణమురళి విచారణ - రైల్వేకోడూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరిచే అవకాశం

POSANI KRISHNA MURALI
POSANI KRISHNA MURALI (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2025, 1:12 PM IST

Updated : Feb 27, 2025, 1:50 PM IST

Police Shifted Posani Krishna Murali to Obulavaripalle: వైఎస్సార్సీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌పై అసభ్య పదజాలం, బూతులతో పేట్రేగిన సినీనటుడు పోసాని కృష్ణమురళిని కాసేపట్లో పోలీసులు రైల్వేకోడూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం రాత్రి హైదరాబాద్​లోని నివాసంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్​కు తీసుకొచ్చారు. స్టేషన్​లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పోసాని స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు పోసానిని కలవాలంటూ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాది నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొరముట్ల శ్రీనివాసులును పోలీసులు వెనక్కి పంపారు. శ్రీనివాసులు కాసేపు గేటు వద్దే నిలబడి పట్టుపట్టగా, తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారని చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్​పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు మాటలు మాట్లాడేవాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు ఉండరాదనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారు మణి చెప్పారు.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగుతోంది. ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 7 గంటలుగా పోసానిని విచారిస్తున్నారు. విచారణకు పోసాని సహకరించడం లేదని, సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారని పోలీసులు అంటున్నారు. పోసాని నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఎస్పీ విద్యాసాగర్‌ పిలుపుతో ఓబులవారిపల్లి పీఎస్‌కు రైల్వేకోడూరు కోర్టు పీపీ, ప్రభుత్వ తరఫు లాయర్లు వచ్చారు.

పోసాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్‌ కల్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై పోసానిని అసభ్యంగా ధూషించారంటూ చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ జోగినేని మణి ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం ఓబులవారిపల్లె పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

'12న తాడేపల్లి వెళ్లా-జగన్‌ను కలిశా' - పోలీసుల విచారణలో వల్లభనేని వంశీ

ప్రభుత్వ భూముల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామ్రాజ్యం - అంతు తేలుస్తున్న అధికారులు

Last Updated : Feb 27, 2025, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details