Manyam Tribals Suffering With Floods Due No Raod Facility :ఆకాశంలో జుమ్మంటూ అధునాతన విమానాలతో దూసుకెళ్తున్న రోజులివి. కానీ మన్యంలో మాత్రం కనీసం రోడ్లు లేవు. వంతెన ఊసే లేదు. వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతి. మట్టి రోడ్లు కూడా కొట్టుకుపోయి దారి కనిపించదు. గూడేనికి చేరుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎలా అయినా ఇంటికి చేరుకోవాలని గిరిపుత్రులు చెట్టుకు తాడు కట్టి పెద్ద ఎత్తున పొంగుతున్న వాగులో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు.
Tribes Built Bridge With Sticks in Middle of the Streams :ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితి మారడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలోనూ గిరిశిఖర గ్రామాలకు కనీసం రోడ్లు లేవు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీలో సుమారు 800మంది జీవిస్తున్నారు. గొల్లబంధ, గంగవరం, నీలవరం, తీగేలామెట్ట, యర్రగొండ, మర్రిపాకాల, పాలసముద్రం, జెర్రీగొంది, రెమలపాలెం, బొద్దుమామిడికి చేరుకోవాలంటే పలకజీడి నుంచి వాగు దాటాల్సిందే. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు సాహసం చేయాల్సిందే.
కొనసాగుతున్న వరద - వణికిపోతున్న గోదావరి పరివాహక ప్రాంతాలు - Rains Effect in Joint East Godavari