Olympic Medal After 12 Years :ఒలింపిక్స్ పతకం కోసం అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తారు. అయితే కొన్నిసార్లు మెరుగ్గా ఆడినప్పటికీ పలు కారణాల వల్ల అనర్హతకు గురై పోటీలకు దూరమవుతుంటారు. కానీ, ఇక్కడ ఓ అథ్లెట్కు ఒలింపిక్ పతకం దక్కాలని రాసి ఉందేమో! దశాబ్ద కాలానికి ఆమెకు పతకం అందనుంది. అలా ఎందుకు జరిగింది? ఆమె ఎవరు? తెలుసుకుందాం.
అమెరికా అథ్లెట్ షానన్ రౌబరీ 2012 లండన్ ఒలింపిక్స్లో పాల్గొంది. ఈ క్రీడల్లో ఆమె మహిళల 1500 మీటలర్ల పరుగు పందెంలో పోటీ పడింది. అయితే ఆ పోటీల్లో ఆమెకు నిరాశే మిగిలింది. ఫైనల్లో షానన్ ఆరో స్థానానికి పరిమితమై పతకం దక్కించుకోలేకపోయింది. దీంతో అప్పట్లో షానన్ తీవ్రంగా బాధపడిందట.
అయితే ఆ పోటీలు ముగిసిన కొన్ని రోజులకు ఓ చీకటి కోణం బయట పడింది. ఆ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లలో అనేక మంది డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధరణ అయ్యారు. దీంతో 2012 ఒలింపిక్స్ రన్నింగ్ రేస్ విశ్వ క్రీడల చరిత్రలో అత్యంత దారుణమైన పోటీగా నిలిచింది. ఆ ఫైనల్స్లో 13 మంది పాల్గొనగా అందులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ విన్నర్స్ సహా మొత్తం ఐదుగురిపై అనర్హత వేటు పడింది.