Rohit Sharma Skips Net Practice :ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి టీమ్ఇండియా మంచి ఊపు మీద ఉంది. మార్చి 2న కివీస్తో జరగబోయే లీగ్ దశ ఆఖరి మ్యాచ్లోనూ గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అకాడమీలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకాలేదట. దీంతో రోహిత్కు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళపడుతున్నారు.
ముమ్ముర ప్రాక్టీస్
పాకిస్థాన్పై విజయం తర్వాత టీమ్ఇండియా ప్లేయర్స్ మొదటిసారి ఐసీసీ ఆకాడమీలో బుధవారం నెట్ ప్రాక్టీస్ చేశారు. ఫుట్ బాల్ ఆడటం, రన్నింగ్ చేయడం వంటివి చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదని తెలుస్తోంది. కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ పర్యవేక్షణలో రోహిత్ నెమ్మదిగా జాగింగ్ మాత్రమే చేశారని సమాచారం. పాక్తో జరిగిన మ్యాచ్ లో రోహిత్కు తొడ కండరాల గాయం ఇబ్బంది పెట్టిందట. అందుకే ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ కఠోర వ్యాయామాలు చేయలేదట. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ టీమ్ఇండియా ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సిబ్బందితో చర్చించాడు.