Police Interrogated Vallabhaneni Vamsi for 5 Hours: 'ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను. అక్కడ మాజీ సీఎం జగన్ని కలిసి తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లాను' అని వల్లభనేని వంశీ పోలీసు కస్టడీలో ఒప్పుకున్నారు. తాడేపల్లి వెళ్లాను కానీ ఎవరినీ కలవలేదని తొలిరోజు విచారణలో చెప్పిన వంశీ ఫోన్ కాల్ డేటా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారాలు చూపేసరికి నిజం ఒప్పుకున్నారు.
12వ తేదీ నాటి ఆయన కాల్ డేటాను, ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే ఫోన్ లోకేషన్ చూపిస్తోందని గట్టిగా ప్రశ్నించేసరికి జగన్ని కలిసినట్లు ఆయన అంగీకరించారు. అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్లు తెలిసింది. రెండోరోజు పోలీసు కస్టడీలో వంశీని 5 గంటల పాటు ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను కస్టడీలోకి తీసుకుని ముగ్గురు ఏసీపీలు వేర్వేరుగా విచారించారు. వంశీకి దాదాపు 25 ప్రశ్నలు పోలీసులు సంధించినట్లు తెలిసింది. ఎక్కువ ప్రశ్నలకు తనకేం తెలీదని సమాధానం చెప్పినట్లు సమాచారం.
పోలీసుల ప్రశ్నలకు వంశీ జవాబులు:
- పోలీసులు: మీ మొబైళ్లు ఎక్కడ ఉన్నాయి?
- వల్లభనేని వంశీ: నేను 3 సిమ్లను 2 ఫోన్లలో వేసి ఉపయోగిస్తున్నా కాకపోతే అవి ఎక్కడ పెట్టానో గుర్తు లేదు.
- పోలీసులు: సత్యవర్ధన్ను అపహరించి హైదరాబాద్, విశాఖకు ఎందుకు తరలించారు? తరలించిన వారితో మీకేం సంబంధం?
- వంశీ: ఎందుకు వచ్చారో, ఎక్కడకు తీసుకెళ్లారో నాకు తెలియదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వారిలో వేల్పుల వంశీ, వేణు, చేబ్రోలు శ్రీను ఎవరో నాకు తెలియదు. మిగిలిన వారు మాత్రం నా అనుచరులే వారితో నాకు పరిచయం ఉంది.
- పోలీసులు: పరారీలో ఉన్న నిందితులను మీరే దాచారా?
- వంశీ: వాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు