Minister Anitha Comments on MP Vijayasai Reddy:తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్ అండ్ కో రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం ఇచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు.
Anita Visit Vijayawada Sub Jail: ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలని తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కచ్చితంగా నిఘా ఉంటుంది చర్యలు తప్పవని అన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని తెలిపారు విజయవాడ సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించిన మంత్రి అనిత ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీసామని అన్నారు. జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేశామని, విచారణ జరుగుతోందని వెల్లడించారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందని దానిపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత స్పష్టం చేశారు.