ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

మూడు పార్టీల పొత్తు జగన్​ను ఓడించడం కోసమే కాదు - రాష్ట్రాన్ని గెలిపించడం కోసం : చంద్రబాబు - Chandrababu Teleconference

Chandrababu Naidu Teleconference With TDP Leaders: రాష్ట్ర పునర్ నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మూడు పార్టీల పొత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే కాదని, రాష్ట్రాన్ని గెలిపించడం కోసమని వెల్లడించారు. టీడీపీ బూత్ లెవల్ కార్యకర్తలు, నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Chandrababu Naidu Teleconference With TDP Leaders
Chandrababu Naidu Teleconference With TDP Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 9:16 PM IST

Chandrababu Naidu Teleconference With TDP Leaders :రాష్ట్ర పునర్ నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే మూడు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే కాదని, రాష్ట్రాన్ని గెలిపించడం కోసమని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బూత్ లెవల్ కార్యకర్తలు, నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Chandrababu About TDP, BJP, Janasena Alliance :రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని, కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కూడా కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించారు. విభేదాలను పక్కన పెట్టి గెలుపు ఒక్కటే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ, ప్రతి సీటూ ముఖ్యమేనని పేర్కొన్నారు. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో దుష్ట పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరమని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయం - ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు

2024 Elections in Andhra Pradesh :పోలవరం ప్రాజెక్టు పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు, మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్రసాయం ఎంతో అవసరమని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్న ప్రతి సందర్భంలో రాష్ట్రానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు ఆశించని పార్టీ తెలుగుదేశం అని అందరికీ తెలుసని వెల్లడించారు.

అందరి చూపు చిలకలూరిపేటవైపే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభకు భారీ ఏర్పాట్లు

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని, కూటమి 160పైగా సీట్లు సాధించాలని కోరారు. జగన్ రెడ్డి జనాన్ని నమ్ముకోలేదని, పోలింగ్​లో జరిగిన అక్రమాలనే నమ్ముకున్నాడని విమర్శించారు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ ఆగడాలు, తప్పుడు అధికారుల ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు.

ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపిన ఎన్డీఏ నేతల ట్వీట్లు- రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడదామంటూ ప్రకటనలు

ABOUT THE AUTHOR

...view details