'ప్రియాంక చోప్రా'కు జై కొట్టిన​ కాంగ్రెస్​..!

By

Published : Dec 2, 2019, 5:57 AM IST

Updated : Dec 2, 2019, 7:19 AM IST

thumbnail
దిల్లీలో నిర్వహించిన ఓ పబ్లిక్​ ర్యాలీలో 'ప్రియాంక చోప్రా జిందాబాద్'​ అంటూ పప్పులో కాలేశారు కాంగ్రెస్ మాజీ​ ఎమ్మెల్యే సురేందర్​ కుమార్​. ఓ సభలో భాగంగా​ ''సోనియా గాంధీ జిందాబాద్..'కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీని ప్రశంసిస్తూ' వారికి జిందాబాద్​'' అంటూ నినాదాలు పలికారు సురేందర్. ఈ తరుణంలో ప్రియాంక గాంధీకి జిందాబాద్​ బదులు.. పొరపాటున ప్రియాంక చోప్రా జిందాబాద్ అని అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్ల నుంచి విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. సురేందర్​ కుమార్..​ 3 సార్లు దిల్లీలోని బవానా ఎమ్మెల్యేగా పనిచేశారు.
Last Updated : Dec 2, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.