వలకు చిక్కిన చేప ఖరీదు రూ.2 లక్షలు..! - బిల్ ఫిష్ జాతికి చెందిన సెయిల్ ఫిష్ ఒడిశా
🎬 Watch Now: Feature Video
ఒడిశా కేంద్రాపడాలోని రాజ్నగర్ బ్లాక్, తల్చువా గ్రామంలో అరుదైన, వేగవంతమైన సముద్ర చేప -‘సెయిల్ ఫిష్’ అక్కడి జాలరులకు చిక్కింది. బే ఆఫ్ బెంగాల్ సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు దొరికిందీ బిల్ ఫిష్ జాతికి చెందిన సెయిల్ ఫిష్. బరువు సుమారు 12 కిలోలు ఉంటుంది. దిఘా ప్రాంతంలో కిలో రూ. 10 వేలకు విక్రయమయ్యే ఈ చేప, ఇప్పుడు రూ.2 లక్షల ధర పలుకుతోంది. స్థానికులు ‘మయూర్’ చేపగా పిలిచే ఈ మత్య్సాన్ని.. అనేక వ్యాధులను నయం చేసే ఔషధ తయారీలో ఉపయోగిస్తారు.
Last Updated : Nov 2, 2019, 7:34 PM IST