భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్గా ఏనబోయిన ఆంజనేయిలు, వైస్ ఛైర్మన్గా చింతల కిష్టయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం చేసుకుంది. తెరాస పార్టీకి చెందిన వెన్రెడ్డి రాజు మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా సీపీఎం పార్టీకి చెందిన బత్తుల శ్రీశైలం ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఆలేరు
ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ ఛైర్మన్ మాధవి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
మోత్కుర్
మోత్కురు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా సావిత్రమ్మ, వైస్ ఛైర్మన్గా బొల్లెపల్లి వెంకటయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
పోచంపల్లి
పోచంపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ చిట్టిప్రోలు విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.