వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండలోని కుమార్పల్లిలో అభం శుభం తెలియని 9 నెలల పాపను ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. కుమార్పల్లికి చెందిన ఓ దంపతులు తమ తొమ్మిది నెలల పాపతో డాబాపై నిద్రిస్తుండగా పక్క కాలనీలో ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. మెలకువ వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించలేదు. వారు చుట్టుపక్కల వెతకగా పాప చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
ఇదీ చదవండిః 'తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు'