ETV Bharat / state

వివాహేతర బంధం.. ఇద్దరు సజీవదహనం - two illegal affaired people was burnt alive

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వికారాబాద్ జిల్లా అంగలూరులో ఈ ఘటన జరిగింది. అంజమ్మ, నరసింహులు నిన్న అర్ధరాత్రి సజీవదహనమయ్యారు. వీరి మధ్య అర్ధరాత్రి ఏం జరింగింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

Illegal Affair Death
ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం
author img

By

Published : Dec 27, 2019, 9:17 PM IST

వికారాబాద్​ జిల్లా అంగలూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరిని బలిగొంది. నిన్న అర్ధరాత్రి పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అసలేం జరిగింది?

చెంగేస్​పూర్​కు చెందిన అంజమ్మతో నరసింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న రాత్రి అంజమ్మ ఇంటికి వెళ్లిన నరసింహులు ఉదయానికి విగత జీవిగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందో తెలియదని... అంజమ్మ తరఫు వారే నరసింహులను తగలబెట్టారని మృతుడి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తులోనే తేలాలి

నిన్న రాత్రి సమయంలో నరసింహులు తమ ఇంటికి వచ్చాడని... అదే సమయంలో తమ తల్లిదండ్రులు వారిని చూడడం వల్ల తమ చెల్లిపై పెట్రోల్​పోసి నిప్పుపెట్టాడని... అడ్డు వచ్చిన తమ తల్లి దండ్రులకు కూడా గాయాలయ్యాయని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయం ఇరు కుటుంబాల్లో తెలిసినప్పటికీ వీరి తీరు మారలేదని... గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం

ఇదీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు

వికారాబాద్​ జిల్లా అంగలూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరిని బలిగొంది. నిన్న అర్ధరాత్రి పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అసలేం జరిగింది?

చెంగేస్​పూర్​కు చెందిన అంజమ్మతో నరసింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న రాత్రి అంజమ్మ ఇంటికి వెళ్లిన నరసింహులు ఉదయానికి విగత జీవిగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందో తెలియదని... అంజమ్మ తరఫు వారే నరసింహులను తగలబెట్టారని మృతుడి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తులోనే తేలాలి

నిన్న రాత్రి సమయంలో నరసింహులు తమ ఇంటికి వచ్చాడని... అదే సమయంలో తమ తల్లిదండ్రులు వారిని చూడడం వల్ల తమ చెల్లిపై పెట్రోల్​పోసి నిప్పుపెట్టాడని... అడ్డు వచ్చిన తమ తల్లి దండ్రులకు కూడా గాయాలయ్యాయని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయం ఇరు కుటుంబాల్లో తెలిసినప్పటికీ వీరి తీరు మారలేదని... గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం

ఇదీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు

Intro:సికింద్రాబాద్ యాంకర్.. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న సంఘటన వికారాబాద్ జిల్లా అంగలూరు గ్రామంలో చోటుచేసుకుంది.. గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న అంజమ్మ నరసింహలు నిన్న అర్ధరాత్రి పెట్రోల్ పోసుకొని సజీవదహనమయ్యారు.. తీవ్ర గాయాలతో కాలిపోయిన వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.. చనిపోయిన వ్యక్తి నరసింహులు బామ్మర్ది సురేందర్ మాట్లాడుతూ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. నరసింహ లో భార్య తమ అక్క ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు అతని మందలించినా మని అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని వారు తెలిపారు.. నరసింహులు భార్యకు ఇద్దరు సంతానం ఉన్నట్లు అతను తెలిపాడు.. అక్రమ సంబంధం వద్దని వారించినా అప్పటికే అతను వినకపోవడంతో ఇలాంటి ఘటన జరిగిందని వారు అన్నారు.. నరసింహులు చెం గేస్ పూర్ గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అన్నారు.. అతను గత కొన్నాళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నారని అదేవిధంగా నిన్న రాత్రి సమయంలో కూడా అక్కడికి వెళ్లి నట్లు వారు తెలిపారు.. తమకు ఉదయం 3 గంటల సమయంలో సమాచారం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూశానని అన్నారు.. జిల్లా ఆసుపత్రి నుండి గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చిన వెంటనే వారు మృతి చెందారని వారు తెలిపారు.. ఎవరో ఎవరిపై డీజిల్ పోసి దాడికి పాల్పడ్డారని విషయం తమకు తెలియదని బంధువులు తెలిపారు.. నరసింహ భార్య పిల్లల పరిస్థితి ఏంటని వారు అడుగుతున్నారు.. వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు.. వీరి అక్రమసంబంధం గురించిన విషయం మీరు కుటుంబాలకు తెలుసునని ఆయన అన్నారు.. ఈ సందర్భంగా మృతురాలి అక్క మాట్లాడుతూ నిన్న రాత్రి సమయంలో నరసింహులు తన చెల్లి వద్దకు వచ్చినట్లు తెలిపారు.. అదే సమయంలో తన తల్లిదండ్రులు వారిద్దరినీ చూడగా అతను ఆమెపై డీజిల్ పోసి అనంతరం అతను కూడా పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.. అదే సమయంలో అడ్డువచ్చిన అంజమ్మ తల్లిదండ్రులకు మంటలు ఆర్పే క్రమంలో తీవ్ర గాయాలైనట్లు వారిని కూడా స్థానిక ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.. గతంలో ఇతని వ్యవహారంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదని ఆమె అన్నారు.. ప్రస్తుతం తమ తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. వీరి మధ్య అక్రమ సంబంధం విషయంలో లో అంజమ్మ నర్సింహులు లోనూ దూరం పెట్టడాన్ని సహించని అతను ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి మాటమాటకి ఆగ్రహానికి లోని నర్సింహులు తన వెంట తీసుకువచిన డీజిల్ పోసినట్లు తర్వాత అతను కూడా పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.. వీరిమధ్య అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన ఎవరు చేశారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నారు..
బైట్.. సురేందర్ మృతుడి బామ్మర్ది
బైట్ ..బక్కమ్మ మృతురాలి అక్క


Body:వంశీ


Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.