ETV Bharat / state

కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు

కార్తీక మాసం రెండో సోమవారం కావడం... శివలింగంపై సూర్యకిరణాలు పడటం వల్ల సూర్యాపేట జిల్లాలోని శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

author img

By

Published : Nov 11, 2019, 1:16 PM IST

కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక మాసం పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో రెండో సోమవారం కావడం, శివ లింగంపై సూర్యకిరణాలు పడడం వల్ల ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి భక్తులు ఎగబడ్డారు.

వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రాభిషేకాలు, సహస్ర నామ బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం జరిపారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు పంచారు.

కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక మాసం పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో రెండో సోమవారం కావడం, శివ లింగంపై సూర్యకిరణాలు పడడం వల్ల ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి భక్తులు ఎగబడ్డారు.

వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రాభిషేకాలు, సహస్ర నామ బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం జరిపారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు పంచారు.

కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

Intro:కార్తీక మాసం పూజలు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం
బూరుగడ్డ శ్రీ శ్రీ శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేతశంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక మాసం పూజలు జరిపారు..

కార్తీకమాసం లో రెండవ
సోమవారం కావడం, స్వామివారి శివ లింగం పై సూర్యకిరణాలు పడడం తో
ఈ దృశ్యాన్ని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి శివలింగం పై పడ్డ సూర్యా కిరణాలు ,స్వామి దర్శనం చేసుకున్నారు .
భక్తులు వేకువజామునే లేచి స్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగించారు .
ఆలయం లో పూజారులు ప్రత్యేక పూజలు జరిపారు.
భక్తులకు ఎటువంటి ఆ సౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు . ఆలయంలో
స్వామివారికి తెల్లవారుజాము నుండే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు సహస్రనామ బిల్వార్చన అష్టోత్తర శతనామావళి పుష్ప పూజ నీరాజనం మంత్రపుష్పం జరిపారు. తదనంతరం తీర్థ ప్రసాద వినియోగం చేశారు.Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.