ETV Bharat / state

దేవుడి గోడు వినేవారు ఎవరు?

author img

By

Published : Dec 16, 2019, 8:03 AM IST

నిత్యం శివారాధన చేస్తూ పాలాభిషేకాలు, దీప దూప నైవేద్యాలు, భక్తుల రద్దీతో... కిటకిటలాడిన ఆ ఆలయం... నేడు శిథిలావస్థకు చేరింది. మునగాల పరగణాకే తలమానికంగా ఉన్న ముక్కంటి సన్నిధి... కాలగర్భంలో కలిసి పోతోంది. గుప్త నిధుల వేటలో పూర్తిగా ధ్వంసమవుతోంది.

దేవుడి గోడు వినేవారు ఎవరు?
దేవుడి గోడు వినేవారు ఎవరు?
దేవుడి గోడు వినేవారు ఎవరు?
సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని శ్రీ సారంగేశ్వర దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 150 సంవత్సరాల క్రితం... నడిగూడెం రాజావారు నాయని వెంకట రంగారావు ఈ దేవాలయాన్ని నిర్మించారు! ఏటా శివరాత్రి, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. దేవాలయానికి నిత్య దూప దీప నైవేద్యాల కోసం సుమారు 20 ఎకరాల మాన్యం భూమి కేటాయించారు. దహన సంస్కారాల అనంతరం స్నానమాచరించేందుకు ఆలయ ప్రాంగణంలో కోనేరు నిర్మించారు. దేవాలయం పక్కనే చెరువు ఉండటం వల్ల... దానిని సారంగేశ్వర చెరువుగా పిలుస్తారు.

గుప్త నిధుల వేట

ఆలయంలో గుప్త నిధులున్నాయని... విద్రోహ శక్తులు ఆలయంలో తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని సైతం నామరూపాలు లేకుండా పెకలించి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థాయిలో పలు దఫాలు కమిటీలు వేసిన ముందడుగు పడలేదు.

ఆక్రమణలో దేవుడి మాన్యం

సారంగేశ్వర దేవాలయానికి నడిగూడెం, బృందావనపురం, కలకోవ, జగన్నాధపురం గ్రామాల్లో 20 ఎకరాల భూములు ఉన్నాయి. నడిగూడెం మండల కేంద్రంలో 6.5 ఎకరాల భూములు మినహా మిగతావన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఏళ్ల తరబడిగా దేవుడు భూములు సాగు చేసుకుంటున్నా... ఎలాంటి కౌలు చెల్లించడం లేదు. అటు దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం శోచనీయం.

నిధులు మంజూరైనా

జీర్ణ దేవాలయ పునరుద్ధరణ పథకం కింద ఆలయ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితం 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కొత్తగా వేరే ప్రాంతంలో స్థలాన్ని సేకరించి నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పాత స్థలంలోనే నిర్మించాలని కొందరు అడ్డుచెప్పారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మళ్లీ దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఆలస్యమైతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

వందల ఏళ్ల చరిత్ర ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. శివరాత్రి, దసరా ఉత్సవాలు తిరిగి ఆలయంలో నిర్వహించుకోవాలని ఆశిస్తున్నారు.

దేవుడి గోడు వినేవారు ఎవరు?
సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని శ్రీ సారంగేశ్వర దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 150 సంవత్సరాల క్రితం... నడిగూడెం రాజావారు నాయని వెంకట రంగారావు ఈ దేవాలయాన్ని నిర్మించారు! ఏటా శివరాత్రి, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. దేవాలయానికి నిత్య దూప దీప నైవేద్యాల కోసం సుమారు 20 ఎకరాల మాన్యం భూమి కేటాయించారు. దహన సంస్కారాల అనంతరం స్నానమాచరించేందుకు ఆలయ ప్రాంగణంలో కోనేరు నిర్మించారు. దేవాలయం పక్కనే చెరువు ఉండటం వల్ల... దానిని సారంగేశ్వర చెరువుగా పిలుస్తారు.

గుప్త నిధుల వేట

ఆలయంలో గుప్త నిధులున్నాయని... విద్రోహ శక్తులు ఆలయంలో తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని సైతం నామరూపాలు లేకుండా పెకలించి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థాయిలో పలు దఫాలు కమిటీలు వేసిన ముందడుగు పడలేదు.

ఆక్రమణలో దేవుడి మాన్యం

సారంగేశ్వర దేవాలయానికి నడిగూడెం, బృందావనపురం, కలకోవ, జగన్నాధపురం గ్రామాల్లో 20 ఎకరాల భూములు ఉన్నాయి. నడిగూడెం మండల కేంద్రంలో 6.5 ఎకరాల భూములు మినహా మిగతావన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఏళ్ల తరబడిగా దేవుడు భూములు సాగు చేసుకుంటున్నా... ఎలాంటి కౌలు చెల్లించడం లేదు. అటు దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం శోచనీయం.

నిధులు మంజూరైనా

జీర్ణ దేవాలయ పునరుద్ధరణ పథకం కింద ఆలయ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితం 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కొత్తగా వేరే ప్రాంతంలో స్థలాన్ని సేకరించి నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పాత స్థలంలోనే నిర్మించాలని కొందరు అడ్డుచెప్పారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మళ్లీ దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఆలస్యమైతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

వందల ఏళ్ల చరిత్ర ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. శివరాత్రి, దసరా ఉత్సవాలు తిరిగి ఆలయంలో నిర్వహించుకోవాలని ఆశిస్తున్నారు.

Intro:దేవుడి గోడు వినేవారు ఎవరు?

( )
నిత్యం శివారాధన చేస్తూ పాలాభిషేకాలు,దీప దూప నైవేద్యాలతో భక్తుల రద్దీతో కిటకిటలాడిన ఆ దేవాలయం నేడు శిథిలావస్థకు చేరింది.... మునగాల పరగణాకె తలమానికంగా ఉన్న ఆ దేవాలయం నేడు కాలగర్భంలో కలిసి పోయే పరిస్థితి ఏర్పడింది.. గుప్త నిధుల వేటలో పూర్తిగా ధ్వంసమైన దేవాలయంని పట్టించుకునే నాధుడే కరువయ్యారు... లక్షలు విలువ చేసే దేవుడి మాన్యాలు ఉన్న ఆలయ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి....


:::VO...
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ సారంగేశ్వర దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నది.అప్పటి నడిగూడెం రాజావారు నాయని వెంకట రంగారావు సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి, దసరా పండుగలు ఘనంగా నిర్వహించేవారు... దేవాలయానికి నిత్య దూప దీప నైవేద్యాలకు సుమారు 20 ఎకరాల దేవుడు మన్యాన్ని కేటాయించారు... దహన సంస్కారాలు పూర్తిచేసుకుని దేవాలయం పక్కనే ఉన్న కొనేరులో స్నానాలు ఆచరిస్తారు. దేవాలయం పక్కనే చెరువు ఉండటంతో ఆ చెరువుకు సారంగేశ్వర చెరువుగా పేరు వచ్చింది....

@@గుప్త నిధుల వేట@@
ఇంతవరకు బాగానే ఉంది.కానీ దేవాలయ అభివృద్ధికి నోచుకోకపోగా ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో కొన్ని విద్రోహ శక్తులు ఆలయంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని దురాశతో తవ్వకాలు ప్రారంభించారు. శివలింగాన్ని సైతం నామరూపాలు లేకుండా పెకలించి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం..
ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థాయిలో పలు దఫాలు కమిటీలు వేసిన ముందుకు సాగాలేని పరిస్థితి...

:::@ఆక్రమణకు గురైన దేవుడు మాన్యం@:::
సారంగేశ్వర దేవాలయానికి నడిగూడెం, బృందావనపురం, కలకోవ, జగన్నాధపురం గ్రామాలలో 20 ఎకరాల భూములు ఉన్నాయి. నడిగూడెం మండల కేంద్రంలో 6.5 ఎకరాల భూములు మినహా మిగతా భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఏళ్ల తరబడి దేవుడు భూములు సాగు చేసుకుంటున్న ఎలాంటి కౌలు చెల్లించడం లేదు. అటు దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం శోచనీయం.

:::@నిధులు మంజూరైనా:::
జీర్ణ దేవాలయ పునరుద్ధరణ పథకం కింద సారంగేశ్వర దేవాలయ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితం 54 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కొత్తగా వేరే ప్రాంతంలో స్థలాన్ని సేకరించి నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించగా, పాత స్థలంలోనే నిర్మించాలని కొందరు అడ్డుచెప్పడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఏడాది కావస్తున్నా నేటికీ దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు... ఆలస్యం అవుతుండటంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది....

ఇప్పటికైనా ఆలయ పునర్నిర్మాణాని చేపట్టి శివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు...bytes..

1బైట్::బెల్లంకొండ సత్యనారాయణ::గ్రామస్థుడు

2బైట్:::కోరట్ల శ్రీనివాస్::స్థానికుడు

3బైట్::సత్యనారాయణ:::గ్రామస్థుడు.


Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::కోరట్ల వాసు
సెంటర్:::కోదాడ

పిటుసి:::కోరట్ల వాసు


Conclusion:ఫోన్ నెంబర్::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.