సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ముడలం రామన్నగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐకేపి కేంద్రంలో కాపలాదారిగా ఉన్న బుచ్చయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గొడ్డలిలో బాది ఇష్టమొచ్చినట్టుగా నరికేశారు. ఐకేపి కేంద్రానికి ఉదయాన్నే వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న బుచ్చయ్యను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: కాసేపట్లో రాజ్భవన్కు కేసీఆర్.. గవర్నర్తో భేటీ