ETV Bharat / state

ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా నిషేధించిన చిరువ్యాపారి - banned plastic

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ చిరువ్యాపారి ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా నిషేధించి... సాటి దుకాణదార్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

banned plastic in siddipet district
author img

By

Published : Nov 17, 2019, 8:09 PM IST

ప్లాస్టిక్‌ అనర్థాల నుంచి ప్రకృతిని కాపాడుకునేందుకు నడుం బిగించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ చిరువ్యాపారి. రాజేశం, మంజుల దంపతుల దుకాణంలో.. స్వయంగా తాము తయారు చేసిన కాగితపు సంచుల్లోనే సరుకులు అందిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో తామే ప్రతిరోజు సాయంత్రం తయారు చేస్తున్నామని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్ల కన్నా వీటి ద్వారానే ఖర్చు తగ్గుతోందని... వినియోగదార్ల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.

ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా నిషేధించిన చిరువ్యాపారి

ఇదీ చూడండి: మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!

ప్లాస్టిక్‌ అనర్థాల నుంచి ప్రకృతిని కాపాడుకునేందుకు నడుం బిగించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ చిరువ్యాపారి. రాజేశం, మంజుల దంపతుల దుకాణంలో.. స్వయంగా తాము తయారు చేసిన కాగితపు సంచుల్లోనే సరుకులు అందిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో తామే ప్రతిరోజు సాయంత్రం తయారు చేస్తున్నామని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్ల కన్నా వీటి ద్వారానే ఖర్చు తగ్గుతోందని... వినియోగదార్ల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.

ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా నిషేధించిన చిరువ్యాపారి

ఇదీ చూడండి: మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!

Intro:నానాటికి పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగంతో భవిష్యత్ లో మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉండడాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించాయి. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఒక సారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేదించారు. ప్రతి రోజు నిత్యవసరాలకు కావాల్సిన సరుకులను దుకాణాల నుండి ప్లాస్టిక్ కవర్లలలో తీసుకెళ్లేడం మనకు అలవాటే. ప్రస్తుతం వాటి పై నిషేధం ఉండడంతో కిరాణా దుకాణానికి నిత్యం సరుకుల కోసం వచ్చే వినియోగదారులకు సరుకులను తీసుకెళ్లడం, దుకాణాదారులకు సరుకులు ఇవ్వడం కష్టంగా మారింది. ఈ తరుణంలో హుస్నాబాద్ లోని గాంధీ చౌరస్తాలో ఉన్న కొండూరి రాజేశం, మంజుల అనే ఓ చిరు దుకాణాదారులు తామే స్వయంగా తయారు చేసిన పేపర్ సంచులలో తమ కిరణానికి వచ్చే వినియోగదారులకు సరుకులు ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజు పావు కిలో నుండి 3 కిలోల వరకు సరుకులు పట్టేలా 100 పేపర్ సంచులను తయారు చేస్తూ, తమ దుకాణానికి వచ్చే వినియోగ దారులకు అందులోనే సరుకులు ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్ ను స్ఫూర్తిగా తీసుకోని దాదాపు నెల రోజుల నుండి ప్రతి రోజు సాయంత్రం తమ ఇంట్లోనే తయారు చేసుకొని, మరుసటి రోజు తమ దుకాణానికి సరుకుల కోసం వచ్చే వినియోగదారులకు ఈ పేపర్ సంచుల్లోనే సరుకులు ఇస్తూన్నామని రాజేశం,మంజుల దంపతులు అంటున్నారు. చిన్నతనంలొనే పేపర్ సంచులను తయారు చేసే అలవాటు ఉండేదని, కేవలం పేపర్ మరియు గమ్ముతో సులభంగా వీటిని ఎవరైనా తయారు చేసుకోవచ్చని, ఇప్పుడు ఇలా తయారు చేసి అందించే అవకాశం వచ్చిందన్నారు. ప్లాస్టిక్ కవర్లను కోనెందుకు అయ్యే ఖర్చు కంటే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇక మీదట ప్రతి రోజు ఇలానే సరుకులు అందిస్తామని అన్నారు. వీరి పనిని చూసి వినియోగదారులు కూడా అభినందిస్తున్నారు.


Body:బైట్స్

1) దుకాణదారుడు కొండూరి రాజేశం
2) పేపర్ సంచుల తయారీదారు
కొండూరి మంజుల


Conclusion:పేపర్ సంచుల తయారీ అందులో సరుకుల అందజేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.