మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. సాయిబాబానగర్కు చెందిన వివాహిత మల్లీశ్వరి.. నిన్న మధ్యాహ్నం తన భర్త అనిల్ కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. ఆచూకీ లేకపోవడం వల్ల అశోక్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరికి గత 5 నెలల క్రితం వివాహం అయినట్లు తెలిపాడు.
యువతి అదృశ్యం
అదే పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన యువతి కరుణ(22) నిన్న ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయింది. కరుణ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రెండు ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం