మేడ్చల్లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లికుమారుడు సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి ముహూర్తానికి ముందు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. వేకువజామునే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్హాల్కు చేరుకున్నారు.
ఏడు గంటల సమయంలో ఫంక్షన్ హాల్లో ఓ గదిలోకి ఒంటరిగా వెళ్లి సందీప్ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవటం వల్ల అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవటంతో సందీప్ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనతో ఫంక్షన్హాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీచూడండి: రెండు నెలల క్రితం వివాహిత అదృశ్యం.. ఇవాళ మృతదేహం లభ్యం