మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరగడం చర్చనీయాంశమైంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్లారు. ఈ రోజు తిరిగి ఇంటికి వచ్చి చూడగా... తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా... దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
బీరువాలో ఉన్న లక్ష 60 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 70తులాల వెండి వస్తువులను అపహరించినట్లు ఎంఈవో తెలిపారు. బాధితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై విక్టర్... చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి పరిసరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో తనిఖీ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం: కేసీఆర్