నిరుపేదలను ఆదుకోవడం కోసమే ఎంజేఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్లో డిసెంబర్ 1న సామూహిక వివాహాలు జరపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్న ఈ వేడుక వేదికకు భూమిపూజ చేశారు. నాలుగోసారి నిర్వహిస్తున్న సామూహిక వివాహ మహోత్సవాలు నిరుపేదలు వినియోగించుకోవాలని సూచించారు.
వివాహాలు జరపడమే కాకుండా... కొత్త సంసారానికి కావాల్సిన సామగ్రిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చూడండి: రోజువారీ కూలీకి వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్