మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చక్రుతండాకు చెందిన అజ్మీరా రూప్లా.. అదే మండల కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టచివరి మారుమూల గిరిజన గ్రామం దొరవారితిమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
సోమవారం ద్విచక్రవాహనంపై బురద దారులపై శ్రమకోర్చి ఊరు వరకు చేరినా వాగు ప్రవాహంతో అక్కడి నుంచి ముందుకెళ్లలేకపోయారు. చివరికి ప్రమాదకరంగా వాగు దాటి పాఠశాలకు చేరుకున్నారు. తిరుగుప్రయాణంలోనూ ఇలాగే ఇల్లు చేరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
![teacher’ difficulties in reaching students in Gudur, Mahabubabad District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-21-13-vaagu-dhati-patashalaku-upadhyudu-av-ts10071_13102020075528_1310f_1602555928_540.jpg)
ఇవీ చూడండి: ధరణి యాప్ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్