అక్కడ ప్రభుత్వాసుత్రికొచ్చే రోగులకు స్మార్ట్ఫోన్ తప్పనిసరి.. ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే అన్నా ఓ సారి ఫోన్ ఇవ్వా.. అమ్మా మీ ఫోన్ ఒకసారి ఇస్తారా... అని అడగాల్సిన పరిస్థితి. ఇదేదో వారి బంధువులకు ఫోన్ చేసుకోవడానికి కాదు. ఎక్స్రే చిత్రం పంపించుకని డాక్టర్కు చూపించి వైద్యం చేయించుకోవడానికి ఇదేం వింత పరిస్థితి అనుకుంటున్నారా అయితే మీరు ఖమ్మం సర్కారు ఆస్పత్రి గురించి తెలుసుకోవాల్సిందే..
స్మార్ట్ఫోన్ తెచ్చుకో... ఎక్స్రే ఫొటో తీసుకో
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్ష్యరాస్యులే. వీరిలో చాల మందికి సెల్ఫోన్ ఉండటమే ఎక్కువంటే...ఎక్స్రే కోసం వచ్చేవారందరికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అంటున్నారు ఖమ్మం ఆస్పత్రి సిబ్బంది. డిజిటలైజేషన్ పేరుతో వస్తున్న మార్పులు ఓవైపు... ఎక్స్రే ఫిల్మ్ల కొరత మరోవైపు వెరసి సర్కారు దవాఖానాలో వైద్యం కోసం వచ్చే వారికి చరవాణి తిప్పలు తెచ్చిపెట్టాయి. స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆస్పత్రిలో ఎక్స్రే తీస్తామంటున్న ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిబంధనలతో గ్రామీణ నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు.
అసలు రోగం కంటే ఈ స్మార్ట్ ఫోన్ కావాలనడం రోగులకు, వారి బంధువులకు కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. కనిపించిన వారినల్లా ఫోన్కోసం బతిమిలాడుతున్నారు. రోగుల కష్టాలు చూడలేని కొంతమంది ఆస్పత్రి వైద్యులు...తమ ఫోన్లకే ఎక్స్రేలు పంపించుకుని వారి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !