ETV Bharat / state

కరీంనగర్ జిల్లా... ఇకపై 'ఐటీ హబ్' - 'ఐటీ హబ్'​గా కరీంనగర్

దేశంలోనే ఐటీ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌తో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు సేవలు  విస్తరించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఐటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌ సమావేశమయ్యారు.

IT Tower in Karimnagar district said by minister gangula kamalakar
కరీంనగర్ జిల్లా... ఇకపై 'ఐటీ హబ్'
author img

By

Published : Dec 24, 2019, 9:12 PM IST

కరీంనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటీ టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ ఐటీ సంస్థల ప్రతినిధులను కోరారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి సమావేశమయ్యారు. కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

38 కోట్ల రూపాయల వ్యయంతో టవర్ నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలి అనుకున్నామని, మున్సిపల్ ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడిందని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు విధివిధానాలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐటీ టవర్‌తో కరీంనగర్ యువతకు ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని వినోద్‌కుమార్ అన్నారు. భవిష్యత్తులో నైపుణ్యం, శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కరీంనగర్ జిల్లా... ఇకపై 'ఐటీ హబ్'

ఇవీచూడండి: 'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్​

కరీంనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటీ టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ ఐటీ సంస్థల ప్రతినిధులను కోరారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి సమావేశమయ్యారు. కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

38 కోట్ల రూపాయల వ్యయంతో టవర్ నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలి అనుకున్నామని, మున్సిపల్ ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడిందని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు విధివిధానాలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐటీ టవర్‌తో కరీంనగర్ యువతకు ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని వినోద్‌కుమార్ అన్నారు. భవిష్యత్తులో నైపుణ్యం, శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కరీంనగర్ జిల్లా... ఇకపై 'ఐటీ హబ్'

ఇవీచూడండి: 'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్​

File : TG_Hyd_48_24_Karimnagar_IT_Tower_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఐటీ టవర్ లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఐటీ కంపెనీల ప్రతినిధులను కోరారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో ప్రణాళికాసంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి మంత్రి సమావేశమయ్యారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ ఛైర్మన్ నరసింహారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. 38 కోట్ల రూపాయల వ్యయంతో టవర్ నిర్మాణం పూర్తవుతోందని... నెలాఖర్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటే మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందని మంత్రి తెలిపారు. కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన విధివిధానాలు, చర్యలు తీసుకోవాలని గంగుల కమలాకర్ ఆదేశించారు. రాష్ట్రంలోని యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగాల కల్పనకై ప్రతి జిల్లాలోనూ ఐటీ టవర్లు, పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఐటీ టవర్ తో కరీంనగర్ యువతకు ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిగిందన్న ఆయన... భవిష్యత్తులో నైపుణ్య, శిక్షణాభిద్ధిసంస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం కల్పించే వసతులు, ప్రోత్సాహకాలను ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.