కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అందులో పదిమందికి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం, తాగునీటి వల్లే ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: గూడు కాలింది... గోడు మిగిలింది