ETV Bharat / state

'ఆర్టీసీ ఛార్జీల పెంపులో రాజకీయం కోణం' - ముఖ్యమంత్రి కేసీఆర్​పై ొన్నాల ఫైర్

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పొన్నాల లక్ష్మయ్య నిరసన వ్యక్తం చేశారు.

Ponnala laxmaiah fire on cm kcr
ఛార్జీల పెంపులో రాజకీయం కోణం
author img

By

Published : Dec 2, 2019, 10:19 PM IST

ఆర్టీసీ ఛార్జీల పెంపులో దోపిడీ కోణం దాగి ఉందని.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మాట మార్చే కేసీఆర్​లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని... పొన్నాల ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చర్చలు జరిపారని ఆరోపించారు.

ఛార్జీల పెంపులో రాజకీయం కోణం

ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

ఆర్టీసీ ఛార్జీల పెంపులో దోపిడీ కోణం దాగి ఉందని.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మాట మార్చే కేసీఆర్​లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని... పొన్నాల ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చర్చలు జరిపారని ఆరోపించారు.

ఛార్జీల పెంపులో రాజకీయం కోణం

ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

Intro:tg_wgl_63_02_rtc_chargila_pempu_pi_nirasana_ab_ts10070
nitheesh, janagama, 8978753177
ఆర్టీసీ ఛార్జీల పెంపులో దోపిడీ కోణం దాగి ఉందని, రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోందని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీల పెంపు నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, మానవత్వం లేని, మాట మార్చే కేసీఆర్ లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రి ని ఎక్కడ చూడలేదని, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాజకీయ కోణంతో పాటు, దోపిడీ కోణం దాగి ఉందన్నారు, ఆర్టీసీ కార్మికుల సమ్మె ను సాకుగా చూపి సామాన్య ప్రయాణికులపై భారం మోపడం సరికాదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చర్చలు జరిపారని, సమ్మె చేస్తున్నపుడు ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిన ముఖ్యమంత్రి ఇప్పుడన్న చార్జీల తో బస్సులు నడుపాలేమని ప్రైవేట్ సంస్థలు చెప్పడంతోనే ఇప్పుడు మాట మార్చి ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపడాని, కొన్ని రోజుల మళ్ళీ మాట మార్చి ప్రైవేట్ పరం చేసేందుకు చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
బైట్: పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.