జనగామ జిల్లా నర్మెట్ట మండలం మల్కపేట శివారు భీక్యాతండాలో దారుణం జరిగింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల మెడ నరికి అదే కత్తితో తనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ కన్న తల్లి. తీవ్ర రక్తస్రావమై... చిన్నారులు వరుణ్, భానుశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా... తల్లి బానోత్ రమను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే... ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ముక్కపచ్చలారని పిల్లలు చనిపోవటం గ్రామంలో విషాదం నింపింది. తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండిః సికింద్రాబాద్లో భారీగా నగదు, ఆభరణాల చోరీ