ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. 19 మందికి గాయాలు జగిత్యాల జిల్లా సారంగపూర్, బీర్పూర్ మండలాల మధ్యలోని ఘాట్ రోడ్పై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్పగాయలు అయ్యాయి. జగిత్యాల నుంచి రంగసాగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జగిత్యాల వైపు వస్తున్న కారు ఘాట్ రోడ్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి