ETV Bharat / state

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన

author img

By

Published : Nov 1, 2019, 3:01 PM IST

హైదరాబాద్​ పార్శిగుట్ట వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానిక మహిళలు ధర్నా చేశారు. వైన్స్​ ఎదుట బైఠాయించిన మహిళలపై బార్​ నిర్వహకులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలికి గాయలయ్యాయి. మహిళలకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు.

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన


హైదరాబాద్ ముషీరాబాద్​లోని పార్శిగుట్ట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేశారు. వైన్ షాప్ ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. అదే సమయంలో సరుకుతో వచ్చిన వాహనం ముందు బైఠాయించారు. మహిళలపై వైన్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్​తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వృద్ధురాలు శశిరేఖకు తీవ్రగాయాలు కాగా మరో మహిళ స్వల్పకు గాయమైంది.

ప్రతిపక్షాల మద్దతు

మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మహిళలకు మద్దతుగా నిలిచారు. ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వైన్స్​, బార్​లకు అనుమతి ఇవ్వడంపై నేతలు, స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికార పార్టీ నేతల తీరుపై మహిళలు మండిపడ్డారు.

మరోవైపు పార్శిగుట్ట సమీపంలోని మూన్​ రాక్ బార్ తెరచి ఉండడాన్ని గమనించిన మహిళలు బార్​ లోపలికి దూసుకు వెళ్లారు. లోనికి వెళ్లిన మహిళలపై వైన్స్​ నిర్వాహకులు దాడికి యత్నించగా వారు తప్పించు కున్నారు.

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన

ఇవీ చూడండి: త్వరలో మద్యం ధరలు పెంపు..?


హైదరాబాద్ ముషీరాబాద్​లోని పార్శిగుట్ట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేశారు. వైన్ షాప్ ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. అదే సమయంలో సరుకుతో వచ్చిన వాహనం ముందు బైఠాయించారు. మహిళలపై వైన్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్​తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వృద్ధురాలు శశిరేఖకు తీవ్రగాయాలు కాగా మరో మహిళ స్వల్పకు గాయమైంది.

ప్రతిపక్షాల మద్దతు

మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మహిళలకు మద్దతుగా నిలిచారు. ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వైన్స్​, బార్​లకు అనుమతి ఇవ్వడంపై నేతలు, స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికార పార్టీ నేతల తీరుపై మహిళలు మండిపడ్డారు.

మరోవైపు పార్శిగుట్ట సమీపంలోని మూన్​ రాక్ బార్ తెరచి ఉండడాన్ని గమనించిన మహిళలు బార్​ లోపలికి దూసుకు వెళ్లారు. లోనికి వెళ్లిన మహిళలపై వైన్స్​ నిర్వాహకులు దాడికి యత్నించగా వారు తప్పించు కున్నారు.

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన

ఇవీ చూడండి: త్వరలో మద్యం ధరలు పెంపు..?

Intro:ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ లో భాగంగా పార్సిగుట్ట లో కొత్తగా వైన్ షాప్ ఏర్పాటు చేయ వద్దంటు మహిళలు ఆందోళన చేపట్టారు....


Body:హైదరాబాద్ ముషీరాబాద్ లోని పార్సిగుట్ట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన వైన్ షాప్ కు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేపట్టారు...... కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ ముందు మహిళలు ధర్నా నిర్వహించారు అదే సమయంలో మద్యం స్టాకు రాగానే మహిళలు ఆ వాహనం ముందు బైఠాయించారు దీంతో మహిళలపై వైన్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్ తో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో వృద్ధురాలు శశిరేఖ కు తీవ్రగాయాలు కాగా మరో మహిళ స్వల్ప గాయం అయింది..... వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ సిపిఐ తెలంగాణ జన సమితి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మహిళలకు మద్దతుగా ధర్నా నిర్వహించారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటి ముబ్బడిగా వైన్ షాపులు బార్ లో అనుమతి ఇవ్వడంపై ఆయా పార్టీల నేతలు స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పద్మారావు తదితర నాయ కుల పై మహిళలు మండిపడ్డారు... అలాగే పార్సిగుట్ట సమీపంలోని మున్ రాక్ బార్ తెరచి ఉండడాన్ని గమనించిన మహిళలు బార్ లోపలికి దూసుకు వెళ్లారు.... లోనికి వెళ్లిన మహిళపై బార్ నిర్వాహకులు అయిన యువకులు మహిళ పై దాడికి యత్నించగా వారు తప్పించు కున్న రు...

బైట్..... సుధాకర్ సిపిఐ నగర కార్యదర్శి

బైట్....నర్సయ్య తెలంగాణ జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు

బైట్..... సునీత స్థానికులు


Conclusion:పార్సిగుట్ట లో మహిళలు అపరకాళిగా వైన్ షాపుల పై దాడులకు పాల్పడ్డారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.