ETV Bharat / state

'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

ఇరవై ఏళ్లుగా నమ్మకంగా ఉందని లక్షల్లో చిట్టీలు కట్టారు. అలాంటి నమ్మకస్తులను నట్టేట ముంచేసి దాదాపు రూ. 2 కోట్లతో ఉడాయించింది ఓ మహిళ. దిక్కుతోచని బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

author img

By

Published : Nov 5, 2019, 4:06 PM IST

guntur 2 crores cheating news
'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా శ్రీనివాసరావు పేటలో ఉంటున్న ధనలక్ష్మి... గత ఇరవై ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేసేది. ఆమెను నమ్మి స్థానికులు లక్షల్లో చిట్టీలు కట్టారు. ఏమైందో ఏమోగానీ అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. ఇవాళ వస్తుంది... రేపు వస్తుందని 3 నెలలుగా చూసిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. తమను నట్టేట ముంచి... దాదాపు రూ. 2 కోట్లతో పారిపోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అంత సీరియస్‌గా ఈ కేసును పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి చిట్టీలు కట్టామని... నిందితురాలిని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి విన్నవించుకున్నారు.

'ధనలక్ష్మి దోచేసింది.. న్యాయం చేయండి'

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా శ్రీనివాసరావు పేటలో ఉంటున్న ధనలక్ష్మి... గత ఇరవై ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేసేది. ఆమెను నమ్మి స్థానికులు లక్షల్లో చిట్టీలు కట్టారు. ఏమైందో ఏమోగానీ అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. ఇవాళ వస్తుంది... రేపు వస్తుందని 3 నెలలుగా చూసిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. తమను నట్టేట ముంచి... దాదాపు రూ. 2 కోట్లతో పారిపోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అంత సీరియస్‌గా ఈ కేసును పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి చిట్టీలు కట్టామని... నిందితురాలిని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి విన్నవించుకున్నారు.

ఇదీ చదవండి:

''గ్రామ అభివృద్ధికి ఎన్నారైలు సహాయం చేయండి''

AP_GNT_23_04_CHITTILA_MOSAM_AV_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్....గుంటూరు శ్రీనివాసరావు పేటలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి గత 20 ఏళ్లుగా చిట్టిలా కట్టించుకుంటుంది. ఆమెను నమ్మి ఇరుగుపొరుగు వారు లక్షలలో చిట్టీలు కట్టడం ప్రారంభించారు. ఇదే అదునుగా భావించిన ధనలక్ష్మి 2 కోట్ల రూపాయల వరకు నగదు కట్టించుకుని 3 నెలలు క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అందరూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని భాదితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలనీ వారు ఫిర్యాదు లో తెలిపారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.