ETV Bharat / state

జనవరి 1నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు - TSRTC CARGO Services

కార్గో బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. జనవరి మొదటి వారం నుంచి ఆర్టీసీలో కార్గో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలివిడతగా 1,209 మంది సిబ్బంది సహా సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఒక్కో డిపోకు రెండు బస్సుల చొప్పున హైదరాబాద్​లోని 29 డిపోల్లో 60 వాహనాలను తీసుకురానున్నారు.

TSRTC CARGO STARTED 1STWEEK OF JANUARY
జనవరి 1నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు
author img

By

Published : Dec 26, 2019, 3:29 PM IST

జనవరి 1నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు

ఆర్టీసీలో ప్రవేశపెట్టే కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు సిద్ధమయ్యాయి. మియాపూర్ బస్ బాడీబిల్డింగ్ యూనిట్‌లో వీటిని సిద్ధం చేస్తున్నారు. కార్గో బస్సులకు ఎర్రరంగును వేయాలని నిర్ణయించారు. జనవరి మొదటివారంలో సిద్ధమైన బస్సులతో కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ అధికారులను ఆదేశించారు.

తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో...

కార్గో బస్సుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో పాటు 800ల డిపోలకు సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. మొదటిదశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు. అనంతరం ప్రభుత్వశాఖలకు విస్తరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో మొదట వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ వస్తువులను రవాణా చేయనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖల వస్తు రవాణాపై దృష్టిసారించనున్నారు.

గ్రేటర్​లో 600 బస్సులు తగ్గింపు...

ఈ సర్వీసుల ఏర్పాటులో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ కీలకపాత్ర పోషించనుంది. లాజిస్టిక్‌ బిజినెస్‌ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఎంపికచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే బాధ్యతలను ప్రాంతీయ మేనేజర్‌ స్థాయి అధికారులు చూస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో ఆక్సుపెన్సీ రేషియా తక్కువగా ఉన్న రూట్లను అధ్యయనం చేసిన సంస్థ.. వేయి బస్సులు తగ్గించాలని నిర్ణయించింది. చివరకు దానిని 600 బస్సులకు పరిమితం చేసింది.

జనవరి 1నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు

ఆర్టీసీలో ప్రవేశపెట్టే కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు సిద్ధమయ్యాయి. మియాపూర్ బస్ బాడీబిల్డింగ్ యూనిట్‌లో వీటిని సిద్ధం చేస్తున్నారు. కార్గో బస్సులకు ఎర్రరంగును వేయాలని నిర్ణయించారు. జనవరి మొదటివారంలో సిద్ధమైన బస్సులతో కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ అధికారులను ఆదేశించారు.

తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో...

కార్గో బస్సుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో పాటు 800ల డిపోలకు సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. మొదటిదశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు. అనంతరం ప్రభుత్వశాఖలకు విస్తరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో మొదట వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ వస్తువులను రవాణా చేయనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖల వస్తు రవాణాపై దృష్టిసారించనున్నారు.

గ్రేటర్​లో 600 బస్సులు తగ్గింపు...

ఈ సర్వీసుల ఏర్పాటులో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ కీలకపాత్ర పోషించనుంది. లాజిస్టిక్‌ బిజినెస్‌ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఎంపికచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే బాధ్యతలను ప్రాంతీయ మేనేజర్‌ స్థాయి అధికారులు చూస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో ఆక్సుపెన్సీ రేషియా తక్కువగా ఉన్న రూట్లను అధ్యయనం చేసిన సంస్థ.. వేయి బస్సులు తగ్గించాలని నిర్ణయించింది. చివరకు దానిని 600 బస్సులకు పరిమితం చేసింది.

TG_HYD_16_25_RTC_CARGO_ARRIVE_1STWEEK_AV_PKG reporter : sripathi.srinivas Note : విజువల్స్ డెస్క్ వాట్స్ అప్ కు పంపించాను. ( ) కార్గో బస్సులు రోడ్డెక్కేందుకు సిద్దమయ్యాయి. జనవరి మొదటి వారం నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ లో బస్సులు తయారవుతున్నాయి. కార్గో కు సంబంధించి తొలివిడతగా 1,209 మంది సిబ్బంది, డిపో సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచనచేస్తోంది. ఒక్కో డిపోకు రెండు సరుకు రవాణా బస్సుల చొప్పున హైదరాబాద్ లోని 29 డిపోల్లో 60 వాహనాలను తీసుకురానున్నారు. మిగితా బస్సులను జిల్లా డిపోలకు పంపించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. Look వాయిస్ : ఆర్టీసీలో ప్రవేశపెట్టే కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. ఆర్టీసీ బస్సులు మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ లో తయారవుతున్నాయి. కార్గో బస్సులకు ఎర్రరంగును వేయాలని నిర్ణయించారున. ఇప్పటికే కొన్ని బస్సులు సిద్దమయ్యాయి. జనవరి మొదటివారంలో ఎన్ని బస్సులు సిద్దమైతే అన్ని బస్సులతో కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో అధికారులు కార్గో సర్వీసుల ప్రారంభానికి సిద్దమవుతున్నారు. వీలైనన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్గో బస్సుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. తొలివిడతలో 1,209 మంది సిబ్బందితో పాటు కార్గో బస్సుల నిర్మాణం ఎక్కువ సంఖ్యలో పూర్తయితే సుమారు 800ల డిపో సరుకు రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. మొదటిదశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు. అనంతరం వీటిని ప్రభుత్వశాఖలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో మొదట వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ వస్తువులను రవాణా చేయనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖల వస్తు రవాణాపై దృష్టిసారించనున్నారు. ఈ సర్వీసుల ఏర్పాటులో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ కీలకపాత్ర పోషించనుంది. లాజిస్టిక్‌ బిజినెస్‌ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఎంపికచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే బాధ్యతలను ప్రాంతీయ మేనేజర్‌ స్థాయి అధికారులు చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 600లకు పైగా బస్సులను తగ్గిస్తున్నారు. మొదట వెయ్యి బస్సులు తగ్గించాలని భావించినప్పటికీ...తర్వాత అధనపు సిబ్బంది కేటాయింపులో సమస్యలు వస్తాయని అనుకున్న అధికారులు తర్వాత 600ల బస్సులు తగ్గించాలనుకున్నారు. వీటినే రవాణాకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మిగులు సిబ్బందిని ఇతర విధులకు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 41 ఆర్టీసీ డ్రైవర్లను అగ్నిమాపక, విపత్తు నిర్వహణల శాఖకు డిప్యూటేషన్ పై పంపిస్తున్నారు. ఇందులో నల్గొండ కు ఆరుగురు, మెదక్ కు ఆరుగురు, ఆదిలాబాద్ కు నలుగురు, కరీంనగర్ కు ఆరుగురు, నిజామాబాద్ కు ఇద్దరు, వరంగల్ కు ముగ్గురు, ఖమ్మం కు నలుగురు, మహబూబ్ నగర్ నలుగురు, రంగారెడ్డి జిల్లాకు ఇద్దరు, హైదరాబాద్ కు నలుగురుని కేటాయించారు. వీరు ఏడాదిపాటు అక్కడే విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 26వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. మిగిలిన వారిని ట్రాఫిక్ కు, తనిఖీలకు, ఇతరత్ర విధులకు కేటాయించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.