.
పీఈటీ ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు 71 మంది ఎంపిక
టీఆర్టీలో పీఈటీ ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు 71 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీన టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు కమిషన్ తెలిపింది.
TSPSC Announce TRT PET RESULTS
.