ETV Bharat / state

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ - గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

పదో తరగతి విద్యార్థులు సాంఘిక, గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్​ను జారీ చేసింది. ఆసక్తి గల విద్యార్థులు రేపటినుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

TELANAGANA GURUKUL COE COLLEGES NOTIFICATION
గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
author img

By

Published : Nov 27, 2019, 8:27 PM IST

సాంఘిక, గిరిజన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేపటి నుంచి డిసెంబరు 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో కేవలం గిరిజన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్​తోపాటు.. జేఈఈ, నీట్, సీఏ, క్లాట్, తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు.

సాంఘిక, గిరిజన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేపటి నుంచి డిసెంబరు 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో కేవలం గిరిజన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్​తోపాటు.. జేఈఈ, నీట్, సీఏ, క్లాట్, తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు.



ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

TG_HYD_75_27_GURUKUL_COE_COLLEGES_NOTIFICATION_AV_3064645 REPORTER: Nageshwara Chary note: Pls Use File Visuals ( ) సాంఘిక, గిరిజన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేపటి నుంచి డిసెంబరు 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎంట్రన్స్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు నిర్వహిస్తారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులు. సాంఘిక సంక్షేమ గురుకుల సీఓఈ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రైస్తవ మతంలోకి మారిన విద్యార్థులు అర్హులు. గిరిజిన సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో కేవలం గిరిజిన విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్ తో పాటు.. జేఈఈ, నీట్, సీఏ, క్లాట్, తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.