ETV Bharat / state

పెట్టుబడుల్లో సింగపూర్ మాకు ఆదర్శం

సింగపూర్ కాన్సుల్ బృదం ఇవాళ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు.

author img

By

Published : Nov 20, 2019, 5:33 PM IST

పెట్టుబడుల్లో సింగపూరే మాకు ఆదర్శం

సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రంలో రెండో రోజు పర్యటించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో ఇవాళ సింగపూర్ బృందం సమావేశమైంది. ఫార్మా, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు.

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతలతో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని వెల్లడించారు. పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దశల వారీగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదర్ సిన్హా పేర్కొన్నారు. ఈ ప్రయత్నాన్ని సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది. కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వాణిజ్య సంబంధాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారు.

పెట్టుబడుల్లో సింగపూరే మాకు ఆదర్శం

ఇవీచూడండి: కేటీఆర్​తో సింగపూర్​ కాన్సుల్ జనరల్​ భేటీ

సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రంలో రెండో రోజు పర్యటించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో ఇవాళ సింగపూర్ బృందం సమావేశమైంది. ఫార్మా, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు.

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతలతో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని వెల్లడించారు. పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దశల వారీగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదర్ సిన్హా పేర్కొన్నారు. ఈ ప్రయత్నాన్ని సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది. కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వాణిజ్య సంబంధాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారు.

పెట్టుబడుల్లో సింగపూరే మాకు ఆదర్శం

ఇవీచూడండి: కేటీఆర్​తో సింగపూర్​ కాన్సుల్ జనరల్​ భేటీ

File : TG_Hyd_37_20_Singapore_Consule_met_Adarsinha_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ తో మంగళవారం సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దానికి కొనసాగింపుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో ఇవాళ సింగపూర్ బృందం సమావేశమైంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్న అదర్ సిన్హా... ఫార్మా, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు. హైదరాబాద్ లో అంతర్జాతీయస్ధాయి విమానాశ్రయంతో పాటు బాహ్యవలయరహదారి ద్వారా మెరుగైన రవాణా వ్యవస్ధ అందుబాటులో ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వివిధ శాఖలు, స్టేక్ హోల్డర్ లతో సింగపూర్ బృందం సమావేశమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అదర్ సిన్హా తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాణిజ్య సంబంధాల మెరుగుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజి, టూరిజం, ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్ మెంట్, హెల్త్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చన్న ఆయన... తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతలతో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని చెప్పారు. పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దశల వారీగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదర్ సిన్హా చెప్పారు. ఈ ప్రయత్నాన్ని సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది. కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వాణిజ్య సంబంధాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.