ETV Bharat / state

వారాసిగూడ హత్య: తనకు దక్కదనే కోపంలో..

హైదరాబాద్​లో ఈరోజు ఉదయం దారుణహత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

author img

By

Published : Jan 24, 2020, 9:33 PM IST

Secundrabad police solved varasiguda murder case
వారాసిగూడ హత్య: తనకు దక్కదనే కోపంలో..
హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న ఉత్తర మండలం డీసీపీ


సికింద్రాబాద్‌ వారాసిగూడలో దారుణ హత్యకు గురైన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి స్నేహితుడు షోయబ్‌ హత్య చేసినట్లు గుర్తించారు. పెళ్లికి నిరాకరించడం వల్ల బాలికను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అమ్మాయి మైనర్..

నిందితుడు షోయబ్ ఫ్లెక్సీబోర్డు డిజైనర్‌గా పనిచేస్తున్నాడని ఉత్తరమండల డీసీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. గతంలో పెళ్లి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడని ఆయన వివరించారు. అమ్మాయి మైనర్ కావడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు.

తలపై రాయితో మోది..

గతకొన్ని రోజులుగా బాలిక షోయబ్‌ను పట్టించుకోవడం మానేసిందని డీసీపీ తెలిపారు. గురువారం అర్ధరాత్రి షోయబ్‌, బాలిక ఇద్దరూ కలిసి ఇంటిపైకి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి బాలిక తలపై రాయితో కొట్టాడని కల్మేశ్వర్ వెల్లడించారు. అమ్మాయిని ఈడ్చుకుంటూ వెళ్లి పైనుంచి కింది పడేశాడని డీసీపీ చెప్పారు.

షోయబ్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. తనకు దక్కలేదనే కోపంతో బాలికను హత్య చేశాడని తెలిపారు.

ఇవీ చూడండి: 'అమీన్​పూర్​ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'

హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న ఉత్తర మండలం డీసీపీ


సికింద్రాబాద్‌ వారాసిగూడలో దారుణ హత్యకు గురైన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి స్నేహితుడు షోయబ్‌ హత్య చేసినట్లు గుర్తించారు. పెళ్లికి నిరాకరించడం వల్ల బాలికను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అమ్మాయి మైనర్..

నిందితుడు షోయబ్ ఫ్లెక్సీబోర్డు డిజైనర్‌గా పనిచేస్తున్నాడని ఉత్తరమండల డీసీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. గతంలో పెళ్లి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడని ఆయన వివరించారు. అమ్మాయి మైనర్ కావడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు.

తలపై రాయితో మోది..

గతకొన్ని రోజులుగా బాలిక షోయబ్‌ను పట్టించుకోవడం మానేసిందని డీసీపీ తెలిపారు. గురువారం అర్ధరాత్రి షోయబ్‌, బాలిక ఇద్దరూ కలిసి ఇంటిపైకి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి బాలిక తలపై రాయితో కొట్టాడని కల్మేశ్వర్ వెల్లడించారు. అమ్మాయిని ఈడ్చుకుంటూ వెళ్లి పైనుంచి కింది పడేశాడని డీసీపీ చెప్పారు.

షోయబ్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. తనకు దక్కలేదనే కోపంతో బాలికను హత్య చేశాడని తెలిపారు.

ఇవీ చూడండి: 'అమీన్​పూర్​ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'

TG_HYD_04_25_GIRL_MURDER_OVERALL_PKG_3055407 REPORTER:K.SRINIVAS ( )సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్ధిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివాహానికి అంగీకరించకుండా... దూరం ఉంచుతుందని... ప్రియురాలిపై పగ పెంచుకున్న ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఆమె పై రాయితో దాడి చేసి గొంతు కోసి దారుణంగా అంతమొందించాడు. ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు.....LOOOK V.O:సికింద్రాబాద్‌ చిలకలగూడ ప్రాంతంలో ఇంటర్‌ విద్యార్ధిని దారుణంగా గొంతు కోసి భవనం పై నుంచి కిందకు పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారాసిగూడకు చెందిన షోయబ్‌... ఇంటర్‌ విద్యార్ధినికి చిరకాలంగా పరిచయం ఉంది. వీరిద్దరు మొదటి తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు. విద్యార్ధిని ని పెళ్లి చేసుకునేందుకు షోయబ్‌ ప్రయత్నాలు చేశాడు. అతను తన తల్లిదండ్రుల ద్వారా విద్యార్ధిని తల్లిదండ్రులకు వివాహం చేసుకుంటాననే విషయం చెప్పించాడు. బాలిక తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. V.O:దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న షోయబ్‌ ఏ విధంగా నైనా అంతం చేయాలని పథకం వేశాడు. గురువారం రాత్రి బాలికను ఇంటి డాబా పైకి పిలిచిన అతను కిరాతకంగా రాయితో గొంతుకోసి, దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్ధినిని భవనం మీద నుంచి తోసి వేశాడు. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఏమీ ఎరుగనట్లు అతను ఇంటికి వెళ్లిపోయాడు. హత్య విషయం బయటపడి రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. బైట్‌:కల్మేశ్వర్‌, ఉత్తర మండలం డిసిపి E.V.O:నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.