ప్రపంచమంతా ప్లాస్టిక్ నియంత్రణపై మల్లగుల్లాలు పడుతుంటే హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నాడు. ప్లాస్టిక్ పునర్వినియోగంపై ఎన్నో అధ్యయనాలు చేసి వాటితో డీజిల్, పెట్రోల్, కిరోసిన్ను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చిన ఆయన... లీటరు పెట్రోల్, డీజిల్ను 55 రూపాయల నుంచి 60 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ ప్రక్రియలో వెలువడే కార్బన్ను పొలాల్లో భూసారం పెంచేందుకు రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతనే బీహెచ్ఈఎల్ ఆర్సీపురంలోని హైడ్రాక్సీ సిస్టమ్స్ సంస్థ నిర్వాహకులు బి.వి. సతీష్ కుమార్. ఆయనతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.
ఇవీ చూడండి: సైనికుల కోసం... విద్యార్థుల వినూత్న యత్నం!