దిల్లీ శివార్లలో నివాసముంటున్న నైజీరియన్లు... ధనవంతులు, వైద్య నిపుణుల వ్యాపారులుగా ఫేస్బుక్ ఖాతాలను తెరిచి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నివాసముంటున్న వారికి అభ్యర్థనలు పంపుతున్నారు. స్పందించిన వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తామని ప్రలోభ పెట్టి.. వారి నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు.
నొప్పి నివారణ ఆయర్వేద నూనెను కొంటామంటూ అంబర్పేటకు చెందిన ఓ యువకుని వద్ద నుంచి నైజీరియన్ లక్కీ ఓజా రూ. 7.80 లక్షల నగదును బదిలీ చేయించుకున్నాడు. లండన్లో ఉంటున్న సరోలిన్ అనే యువతి పేరుతో పరిచయం చేసుకున్నాడు. విటోలిన్ అనే నొప్పి నివారణ నూనె భారత్లో లభిస్తుందని.. దాన్ని లండన్లో అమ్మితే లక్షల్లో లాభం వస్తుందని వివరించారు. నైజీరియన్ మాటలు నమ్మిన బాధితుడు.. అతను సూచించిన చిరునామాకు రూ. 97 వేల 500 పంపించాడు.
రెండు రోజుల తర్వాత సరోలిన్కు ఫోన్ చేయగా మరో 35 బాటిళ్లు కావాలని చెప్పాడు. లక్షల్లో లాభం వస్తుందని విటోలిన్ నూనె కంపెనీ ఖాతాలో రూ. 6,82,500 జమ చేశారు. సీసాలు ఎప్పుడు వస్తాయని ఫోన్ చేయగా స్విఛాఫ్ వచ్చింది. యువకుడు పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దిల్లీ వెళ్లి లక్కీ ఓజాకు సహకరించిన దీపక్ను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి లక్కీ ఓజాను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు.
ఇదిలా ఉండగా మరో నైజీరియన్ జేమ్స్ ఓబాసీ నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచి యువతీ యువకులకు అభ్యర్థనలు పంపేవాడు. పరిచయమైన కొద్దిరోజులకు బహుమతులు పంపుతానని చెప్పేవాడు. అనంతరం విమానాశ్రయ అధికారిగా బాధితులతో మాట్లాడేవాడు. ఖరీదైన బహుమతి వచ్చిందని.. దాన్ని విడిపించుకోవాలంటే వేలు డిపాజిట్ చేయాలనేవాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్కు చెందిన ఓ యువకుడు రూ.1.2 లక్షల నగదు బదిలీ చేశాడు. బహుమతి రాదని తెలుసుకుని సీసీఎస్ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండిః పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల