ETV Bharat / state

కొత్త సీఎస్​ పదవి ఎవరికి దక్కేనో...?

author img

By

Published : Dec 4, 2019, 5:01 AM IST

Updated : Dec 4, 2019, 7:36 AM IST

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ ఎస్కే జోషి నెలాఖర్లో పదవీవిరమణ చేయనున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారి నుంచి సీఎస్​ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, సోమేశ్‌ కుమార్, అదర్ సిన్హా  పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

New CS of Telangana
కొత్త సీఎస్​ ఎవరికి దక్కేనో...?
కొత్త సీఎస్​ ఎవరికి దక్కేనో...?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి 2018 ఫిబ్రవరి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 1960లో జన్మించిన జోషి.. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు రెండేళ్లు సీఎస్​గా ఉన్న ఆయనకు కొనసాగింపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ విషయమై ఆయన కూడా ఆసక్తిగా లేరు. జోషీ స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను సీఎస్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో పలువులు అధికారులు ఉన్నారు.

1983 బ్యాచ్‌కు చెందిన బీపీఆచార్య, బినయ్ కుమార్, 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన పుష్పా సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, 1986 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అధికారులే. 1987 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్‌కు చెందిన అదర్ సిన్హా, రాణికుమిదిని, శాలినీమిశ్రా జాబితాలో ఉన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, సోమేశ్​ కుమార్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.

వీరిలో బినయ్ కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, రాణికుమిదిని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన అధికారులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, అదర్ సిన్హా, సోమేశ్​ కుమార్, శాంతికుమారి సీఎస్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది.

1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రాకు 2020 జులై వరకు పదవీకాలం ఉంది. వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అజయ్ మిశ్రా రేసులో ముందున్నారు. చిత్రారామచంద్రన్‌కు 2021 ఏప్రిల్ వరకు, రాజేశ్వర్ తివారీకి 2020 ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉంది. శాలినీమిశ్రా 2022 నవంబర్ వరకు పదవిలో ఉంటారు. 2022 మే వరకు అదర్ సిన్హా, 2023 డిసెంబర్ వరకు సోమేశ్​ కుమార్, 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి పదవిలో ఉంటారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నందున రాజేశ్వర్ తివారీకి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. చిత్రారామచంద్రన్‌కు అవకాశం దక్కితే రాష్ట్రానికి మొదటి మహిళా సీఎస్ అవుతారు.

అదర్ సిన్హా, సోమేశ్​ కుమార్, శాంతికుమారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదర్ సిన్హా ప్రస్తుతం సాధారణ పరిపాలనాశాఖ వ్యవహారాలు చూస్తున్నారు. కీలకమైన రెవెన్యూలోని అన్ని విభాగాల బాధ్యతలు సోమేశ్​ కుమార్ చూస్తున్నారు. శాంతికుమారి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ పిక చేయనున్నారు.

ఇవీచూడండి: మున్సిపల్​ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

కొత్త సీఎస్​ ఎవరికి దక్కేనో...?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి 2018 ఫిబ్రవరి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 1960లో జన్మించిన జోషి.. ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు రెండేళ్లు సీఎస్​గా ఉన్న ఆయనకు కొనసాగింపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ విషయమై ఆయన కూడా ఆసక్తిగా లేరు. జోషీ స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను సీఎస్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో పలువులు అధికారులు ఉన్నారు.

1983 బ్యాచ్‌కు చెందిన బీపీఆచార్య, బినయ్ కుమార్, 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన పుష్పా సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, 1986 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అధికారులే. 1987 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్‌కు చెందిన అదర్ సిన్హా, రాణికుమిదిని, శాలినీమిశ్రా జాబితాలో ఉన్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, సోమేశ్​ కుమార్ కూడా ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.

వీరిలో బినయ్ కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, రాణికుమిదిని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన అధికారులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, అదర్ సిన్హా, సోమేశ్​ కుమార్, శాంతికుమారి సీఎస్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది.

1984 బ్యాచ్‌కు చెందిన అజయ్ మిశ్రాకు 2020 జులై వరకు పదవీకాలం ఉంది. వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అజయ్ మిశ్రా రేసులో ముందున్నారు. చిత్రారామచంద్రన్‌కు 2021 ఏప్రిల్ వరకు, రాజేశ్వర్ తివారీకి 2020 ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉంది. శాలినీమిశ్రా 2022 నవంబర్ వరకు పదవిలో ఉంటారు. 2022 మే వరకు అదర్ సిన్హా, 2023 డిసెంబర్ వరకు సోమేశ్​ కుమార్, 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి పదవిలో ఉంటారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నందున రాజేశ్వర్ తివారీకి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. చిత్రారామచంద్రన్‌కు అవకాశం దక్కితే రాష్ట్రానికి మొదటి మహిళా సీఎస్ అవుతారు.

అదర్ సిన్హా, సోమేశ్​ కుమార్, శాంతికుమారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదర్ సిన్హా ప్రస్తుతం సాధారణ పరిపాలనాశాఖ వ్యవహారాలు చూస్తున్నారు. కీలకమైన రెవెన్యూలోని అన్ని విభాగాల బాధ్యతలు సోమేశ్​ కుమార్ చూస్తున్నారు. శాంతికుమారి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ పిక చేయనున్నారు.

ఇవీచూడండి: మున్సిపల్​ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

File : TG_Hyd_02_04_New_CS_Pkg_3053262 From : Raghub Vardhan ( ) కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరెన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ జోషి నెలాఖర్లో పదవీవిరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలో ఉన్న వారి నుంచి సీఎస్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, సోమేష్ కుమార్, అదర్ సిన్హా పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి...లుక్ వాయిస్ ఓవర్ - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి 2018 ఫిబ్రవరి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 1960లో జన్మించిన ఆయన ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు రెండేళ్లుగా సీఎస్ గా ఉన్న ఆయనకు కొనసాగింపు అవకాశాలు తక్కువే. కొనసాగింపు విషయమై జోషి కూడా ఆసక్తిగా లేరు. దీంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను సీఎస్ గా నియమిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో పలువులు అధికారులు ఉన్నారు. 1983 బ్యాచ్ కు చెందిన బీపీఆచార్య, బినయ్ కుమార్, 1984 బ్యాచ్ కు చెందిన అజయ్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు. 1985 బ్యాచ్ కు చెందిన పుష్పా సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, 1986 బ్యాచ్ కు చెందిన రాజేశ్వర్ తివారీ కూడా సీనియర్ అధికారులే. 1987 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ కు చెందిన అదర్ సిన్హా, రాణికుమిదిని, శాలినీమిశ్రాలు జాబితాలో ఉన్నారు. 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి, సోమేష్ కుమార్ కూడా స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంటుంది. వీరిలో బినయ్ కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, రాణికుమిదిని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఉన్న బీపీఆచార్య, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్న సురేష్ చందా సచివాలయానికి దూరంగా ఉన్నారు. ప్రత్యేక పరిస్థితులు ఉత్పన్నమైతే తప్ప ఈ అధికారులందరికీ సీఎస్ గా అవకాశం లేనట్లేనని భావిస్తున్నారు. ఇక మిగిలిన అధికారులు అజయ్ మిశ్రా, చిత్రారామచంద్రన్, రాజేశ్వర్ తివారీ. అదర్ సిన్హా, సోమేష్ కుమార్, శాంతికుమారి రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. 1984 బ్యాచ్ కు చెందిన అజయ్ మిశ్రాకు 2020 జూలై వరకు పదవీకాలం ఉంది. వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అజయ్ మిశ్రా రేసులో ముందున్నారు. చిత్రారామచంద్రన్ కు 2021 ఏప్రిల్ వరకు, రాజేశ్వర్ తివారీకి 2020 ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉంది. శాలినీమిశ్రా 2022 నవంబర్ వరకు పదవిలో ఉంటారు. 2022 మే వరకు అదర్ సిన్హా, 2023 డిసెంబర్ వరకు సోమేష్ కుమార్, 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి పదవిలో ఉంటారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఉన్నందున రాజేశ్వర్ తివారీకి అవకాశాలు తక్కువేనని అంటున్నారు. చిత్రారామచంద్రన్ కు అవకాశం దక్కితే తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా సీఎస్ అవుతారు. అదర్ సిన్హా, సోమేష్ కుమార్, శాంతికుమారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదర్ సిన్హా ప్రస్తుతం సాధారణపరిపాలనా శాఖ వ్యవహారాలు చూస్తున్నారు. కీలకమైన రెవెన్యూలోని అన్ని విభాగాల బాధ్యతలు సోమేష్ కుమార్ చూస్తున్నారు. శాంతికుమారి వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయనున్నారు.
Last Updated : Dec 4, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.