ETV Bharat / state

మీకన్నా మా బలం పదింతలు ఎక్కువ: మంత్రి తలసాని

author img

By

Published : Oct 27, 2020, 4:17 PM IST

Updated : Oct 27, 2020, 7:48 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస గెలుస్తుందనే నమ్మకం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయం కట్టబెడతాయన్నారు. దుబ్బాక ఘటనపై భాజపా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని శ్రీనివాస్​ యాదవ్ హెచ్చరించారు. భాజపా కన్నా తమ బలం పదింతలు ఎక్కువేనని.. సంస్కారాన్ని విడిచిపెడితే అంతకన్నా ఎక్కువే మాట్లాడగలమన్నారు. తమకు అరవై లక్షల కార్యకర్తల బలం ఉందని.. తాము కూడా అదే విధంగా ముట్టడిలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

డబ్బు దొరికినట్లు ఆ కుటుంబమే ఒప్పకుంది: మంత్రి తలసాని
డబ్బు దొరికినట్లు ఆ కుటుంబమే ఒప్పకుంది: మంత్రి తలసాని

దుబ్బాక ఘటనపై భాజపా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని రాష్ట్ర పశుంసవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ హెచ్చరించారు. భాజపా కన్నా తమ బలం పదింతలు ఎక్కువేనని.. సంస్కారాన్ని విడిచిపెడితే అంతకన్నా ఎక్కువే మాట్లాడగలమన్నారు. సీఎం, మంత్రులు అనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో మాట్లాడితే ప్రజలు వారినే చీదరించుకుంటారన్నారు. ఎన్నికల సమయంలో సోదాలు సాధారణంగా జరుగుతాయని.. మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెరాస అభ్యర్థి సుజాత ఇళ్లల్లో కూడా జరిగాయన్నారు.

మీకన్నా మా బలం పదింతలు ఎక్కువ: మంత్రి తలసాని

తమకు అరవై లక్షల కార్యకర్తల బలం ఉందని.. తాము కూడా అదే విధంగా ముట్టడిలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు. బాధ్యాతాయుత పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రి, ఎంపీ కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా.. అక్కడికి వెళ్లి హంగామా చేశారన్నారు. దొంగే.. 'దొంగ దొంగ' అన్నట్లు భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని తలసాని మండిపడ్డారు.

కేసీఆర్ కిట్, రైతుబంధు పథకాల్లో తమ నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తున్న భాజపా నేతలు.. అది నిజమే అయితే కేంద్రం నుంచి ప్రకటన విడుదల చేయించాలని తలసాని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి దుబ్బాకలో ప్రజలందరూ తమ వైపే ఉన్నారన్నారు. రెండు సార్లు కనీసం డిపాజిట్ సాధించని భాజపా అభ్యర్థిని చూసి తాము భయపడుతున్నామా అని తలసాని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు పద్ధతి మార్చుకుని హుందాగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరంచారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్​

దుబ్బాక ఘటనపై భాజపా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని రాష్ట్ర పశుంసవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ హెచ్చరించారు. భాజపా కన్నా తమ బలం పదింతలు ఎక్కువేనని.. సంస్కారాన్ని విడిచిపెడితే అంతకన్నా ఎక్కువే మాట్లాడగలమన్నారు. సీఎం, మంత్రులు అనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో మాట్లాడితే ప్రజలు వారినే చీదరించుకుంటారన్నారు. ఎన్నికల సమయంలో సోదాలు సాధారణంగా జరుగుతాయని.. మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెరాస అభ్యర్థి సుజాత ఇళ్లల్లో కూడా జరిగాయన్నారు.

మీకన్నా మా బలం పదింతలు ఎక్కువ: మంత్రి తలసాని

తమకు అరవై లక్షల కార్యకర్తల బలం ఉందని.. తాము కూడా అదే విధంగా ముట్టడిలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు. బాధ్యాతాయుత పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రి, ఎంపీ కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా.. అక్కడికి వెళ్లి హంగామా చేశారన్నారు. దొంగే.. 'దొంగ దొంగ' అన్నట్లు భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని తలసాని మండిపడ్డారు.

కేసీఆర్ కిట్, రైతుబంధు పథకాల్లో తమ నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తున్న భాజపా నేతలు.. అది నిజమే అయితే కేంద్రం నుంచి ప్రకటన విడుదల చేయించాలని తలసాని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి దుబ్బాకలో ప్రజలందరూ తమ వైపే ఉన్నారన్నారు. రెండు సార్లు కనీసం డిపాజిట్ సాధించని భాజపా అభ్యర్థిని చూసి తాము భయపడుతున్నామా అని తలసాని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు పద్ధతి మార్చుకుని హుందాగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరంచారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్​

Last Updated : Oct 27, 2020, 7:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.