సీసీరోడ్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్ పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. కమ్యూనిటీ హాల్ వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో చెత్తను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. రోడ్లు డ్రైనేజీ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.ఇవీ చూడండి: మహబూబాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య