ETV Bharat / state

'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

author img

By

Published : Dec 28, 2019, 11:43 PM IST

శాసనసభ, మండలి కమిటీల ఛైర్​పర్సన్ల మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ సభాపతులు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, చీఫ్​ విప్​లు, విప్​లు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథక ఫలాలు ప్రజలకు అందేలా కమిటీలు కృషి చేయాలని సభాపతులు సూచించారు.

LEGISLATURE COMMITTEES FIRST MEETING
LEGISLATURE COMMITTEES FIRST MEETING

చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఉభయ సభాపతులు కోరారు. శాసనసభ, మండలి కమిటీల ఛైర్​పర్సన్ల మొదటి సమావేశంలో మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉభయ సభల కమిటీల ఛైర్​పర్సన్లతో పాటు చీఫ్ విప్​లు, విప్​లు పాల్గొన్నారు.

ప్రజాపాలనలో కీలక పాత్ర పోషించాలి...

చట్టసభల కమిటీలకు సంబంధించిన రెండు పుస్తకాలను సమావేశంలో విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని మండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి ఉందన్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... కమిటీలు తరచూ సమావేశం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ప్రజా పాలనలో కీలక పాత్ర పోషించే బాధ్యత కమిటీ సభ్యులపైన ఉందన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి... మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కమిటీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయో... లేదా చూడాలని సూచించారు.

ఆర్నెళ్లకోసారి సమావేశం...

వివిధ పథకాల కొరకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా కమిటీలు పరిశీలించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని కమిటీల ఛైర్మన్ల సమావేశం నిర్వహించడం మంచి సంప్రదాయమని ఛైర్మన్లు తెలిపారు. ప్రతి ఆర్నెళ్లకోసారి సమావేశం నిర్వహించాలని ఛైర్మన్లు కోరిన కోరికమేరకు... సభాపతి పోచారం అంగీకారం తెలిపారు.

'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఉభయ సభాపతులు కోరారు. శాసనసభ, మండలి కమిటీల ఛైర్​పర్సన్ల మొదటి సమావేశంలో మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉభయ సభల కమిటీల ఛైర్​పర్సన్లతో పాటు చీఫ్ విప్​లు, విప్​లు పాల్గొన్నారు.

ప్రజాపాలనలో కీలక పాత్ర పోషించాలి...

చట్టసభల కమిటీలకు సంబంధించిన రెండు పుస్తకాలను సమావేశంలో విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని మండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి ఉందన్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... కమిటీలు తరచూ సమావేశం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ప్రజా పాలనలో కీలక పాత్ర పోషించే బాధ్యత కమిటీ సభ్యులపైన ఉందన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి... మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కమిటీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయో... లేదా చూడాలని సూచించారు.

ఆర్నెళ్లకోసారి సమావేశం...

వివిధ పథకాల కొరకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా కమిటీలు పరిశీలించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని కమిటీల ఛైర్మన్ల సమావేశం నిర్వహించడం మంచి సంప్రదాయమని ఛైర్మన్లు తెలిపారు. ప్రతి ఆర్నెళ్లకోసారి సమావేశం నిర్వహించాలని ఛైర్మన్లు కోరిన కోరికమేరకు... సభాపతి పోచారం అంగీకారం తెలిపారు.

'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

File : TG_Hyd_86_28_Legislature_Commitees_AV_3053262 From : Raghu Vardhan ( ) చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని సభాపతులు కోరారు. శాసనసభ, మండలి కమిటీల ఛైర్ పర్సన్ల మొదటి సమావేశంలో మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉభయ సభల కమిటీల ఛైర్ పర్సన్లతో పాటు చీఫ్ విప్ లు, విప్ లు పాల్గొన్నారు. చట్టసభల కమిటీలకు సంబంధించిన రెండు పుస్తకాలను సమావేశంలో విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి ఉందన్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... కమిటీలు తరచూ సమావేశం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ప్రజా పాలనలో కీలక పాత్ర పోషించే బాధ్యత కమిటీ సభ్యులపైన ఉందన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి... మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కమిటీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయా... లేదా చూడాలని చెప్పారు. వివిధ పథకాల కొరకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా కమిటీలు పరిశీలించాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని కమిటీల ఛైర్మన్ల సమావేశం నిర్వహించడం మంచి సంప్రదాయమన్న ఛైర్మన్లు... ప్రతి ఆర్నెళ్లకోమారు అందరితో సమావేశం నిర్వహించాలని కోరారు. ఇకనుంచి ప్రతి ఆర్నెళ్లకోమారు కమిటీ ఛైర్ పర్సన్ల సమావేశం నిర్వహిస్తామని శాసనసభాపతి పోచారం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.