దిల్లీలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. భాజపా కేంద్ర కార్యాలయంలోని ఓబీసీ మోర్చా ఛాంబర్లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.
కాసేపట్లో అన్ని రాష్ట్రాల ఓబీసీ మోర్చా అధ్యక్షులతో లక్ష్మణ్ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ లక్ష్మణ్ను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా నేతలు పెద్దఎత్తున తరలొచ్చారు.
ఇదీ చదవండి: వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...